Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను టార్చర్ పెట్టి చితక్కొట్టిన కజికిస్థాన్ మాజీ మంత్రి...

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (14:31 IST)
కజికిస్థాన్‌ దేశానికి చెందిన మాజీ మంత్రి ఒకరు తన భార్యను ఏకంగా ఎనిమిది గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చితకబాదాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. 44 యేళ్ల కౌండ్యక్ బిషిమబేయెవ్ కజకిస్థాన్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈయన 31 యేళ్ల భార్య సాల్టానంట్ నుకెనోవాపై ఆయన దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్తా వెలుగులోకి రావడంతో వైరల్ అయ్యాయి. దాదాపు ఎనిమిది గంటలపాటు ఆమె భార్యను నిర్బంధించి దాడి చేశారు.
 
తన భర్త బంధువుల రెస్టారెంట్‌లో నుకెనోవా గత యేడాది నవంబరులో విగతజీవిగా కనిపించారు. భర్తే ఆమెను దారుణంగా హింసించి చంపశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోణలను ఆయన ఖండించారు. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా ఆయన నేరాన్ని అంగీంకరించారు. అయితే, అమెను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదని కోర్టుకు తెలిపారు. కానీ, ఆ దేశంలో మాత్రం మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కేసు విచారణ కోర్టులో సాగుతుంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments