భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ లేఖ.. ట్విట్టర్‌లో వైరల్

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (19:16 IST)
Student Letter
భర్తను కోల్పోయిన టీచర్‌కు ఓ స్టూడెంట్ రాసిన లేఖ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, మసాచుసెట్స్‌లోని ఓ పాఠశాలకు చెందిన టీచర్ మెలిసా మిల్నర్ భర్త.. అనారోగ్యం కారణంగా మరణించాడు. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఓ స్టూడెంట్‌.. తమ టీచర్ అలా బాధగా ఉండటం తట్టుకోలేకపోయాడు. ఆమెను ఓదార్చేందుకు ఒక లెటర్ రాశాడు. 
 
'డియర్ మిసెస్ మిల్నర్‌.. మీరు మీ భర్తను కోల్పోవడం చాలా బాధాకరం. మీ భర్తను ఇకపై మీరు చూడలేకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ మీ హృదయాలను కలిపే ఒక లైన్ ఉంటుందని గుర్తించండి. ఈ బాధ నుంచి త్వరగా కోలుకోండి' అంటూ ఆ లేఖలో రాశాడు. 
 
అంతేకాదు ఆ లేఖలో ఒక డ్రాయింగ్ కూడా వేశాడు. ఆకాశంలో ఉన్న భర్త కోసం మిల్నర్ చేతులు చాపుతున్నట్లు డ్రాయింగ్ వేసి.. వారి ఇద్దరి హృదయాలను కలుపుతూ ఒక గీత గీశాడు. స్టూడెంట్ రాసిన లేఖతో ఆ టీచర్ ఎంతో ఎమోషనల్ అయింది. తనపై స్టూడెంట్ చూపిన అభిమానాన్ని మిల్నర్ ట్విటర్ ద్వారా పంచుకుంది. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments