Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (16:21 IST)
Bus fire
ఆఫ్ఘనిస్తాన్‌లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాబూల్‌కు బహిష్కరించిన వలసదారులను తీసుకెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న 71 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. వీరిలో 17 మంది పిల్లలు కూడా ఉన్నారు. బస్సు డ్రైవర్ అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలోని వెళ్లిన బాధితులను రక్షించలేకపోయారు. అప్పటికే బస్సు మొత్తం సజీవదహనమైంది. 
 
బస్సు ఒక ట్రక్కు మోటార్‌బైక్‌ను ఢీకొట్టడంతో భారీ మంటలు చెలరేగి చాలా మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ట్రాఫిక్ ప్రమాదాలు సర్వసాధారణం, ప్రధానంగా రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా. గత కొన్ని నెలల్లో దాదాపు 1.8 మిలియన్ల మంది ఆఫ్ఘన్‌లను ఇరాన్ నుండి బలవంతంగా తిరిగి పంపించారు. 
 
ఈ సంవత్సరం ప్రారంభం నుండి పాకిస్తాన్ నుండి మరో 1,84,459 మందిని తిరిగి పంపించారు. అలాగే 5,000 మందికి పైగా టర్కియే నుండి బహిష్కరించబడ్డారు. అదనంగా, దాదాపు 10,000 మంది ఆఫ్ఘన్ ఖైదీలను స్వదేశానికి తరలించారు, వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్ నుండి వచ్చిన వారే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments