Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల కోసం ఉగ్రవాదులను వదిలిపెట్టిన నైజీరియా

బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది

Webdunia
ఆదివారం, 7 మే 2017 (14:34 IST)
బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది పాఠశాల విద్యార్థినుల్లో 82 మంది విడిచిపెట్టారు. మిగిలిన వారిని కూడా విడిపించేందుకు నైజీరియా సర్కారు చర్యలు చేపట్టింది. 
 
దాదాపు మూడేళ్ల క్రితం చిబుక్‌లోని పాఠశాలపై దాడి చేసిన బోకోహరామ్ ఉగ్రవాదులు 200 మందికి పైగా అమ్మాయిలను అపహరించుకుపోగా, ఆపై అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో 21 మందిని విడిచిపెట్టగా, ఇపుడు మరో 82 మందిని వదిలిపెట్టారు. ఆపై ఉగ్రవాదులతో నైజీరియా ప్రభుత్వం నెలల తరబడి చర్చలు జరిపింది. తాము జరిపిన చర్చలు ఇప్పటికి ఫలవంతం అయ్యాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
 
తమ సెక్యూరిటీ అధికారులకు ఉగ్రవాదులు అమ్మాయిలను అప్పగించారని తెలిపారు. వీరిని అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ స్వయంగా కలుస్తారని తెలిపారు. వీరందరూ ప్రస్తుతం సైన్యం అధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. బందీలుగా ఉన్న మిగతా వారిని కూడా విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తాము విడిచిపెట్టిన ఉగ్రవాదుల వివరాలను మాత్రం నైజీరియా ప్రభుత్వం వెల్లడించలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం