Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (16:19 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కూడా ఒకసారి భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.. భారత్‌కు రానుండటం గమనార్హం. ఆయన నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. ఆయన పర్యటన సెప్టెంబరు 7 నుంచి 10వ తేదీ మధ్య కొనసాగుతుంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ అధికారికంగా వెల్లడించింది. 
 
ఢిల్లీ వేదికగా జి20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఇందులో 30కి పైగా దేశాధినేతలు పాల్గొననున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకరు. ఈ సమావేశాల్లో పాల్గొనే బైడెన్.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక మార్పులు, వాతావరణ మార్పులు, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై మాట్లాడనున్నారు. అలాగే 2026లో జరిగే జీ20 సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చే అంశంపై కూడా జో బైడెన్ ప్రస్తావించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments