Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైడెన్ ఆదేశాలు.. వైమానిక దాడులు 17మంది ఇరాన్ ఫైటర్లు మృతి

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:19 IST)
సిరియాలోని కొన్ని స్థావరాలపై ఇవాళ అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఆ రాకెట్ దాడుల్లో సుమారు 17 మంది ఇరాన్ ఫైటర్లు మృతిచెందారు. ఇరాన్ మద్దతు ఇచ్చే మిలిటెంట్ల స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాక్‌లోని అమెరికా దళాలపై మూడు వేర్వేరు రాకెట్ దాడులు జరిగాయి. దానికి ప్రతీకారంగా అమెరికా తాజా రాకెట్ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. 
 
అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆదేశాలతోనే ఇరాన్‌ మిలిటెంట్లపై దాడులు జరిగాయి. ఇటీవల ఇరాక్‌లోని ఇర్బిల్‌లో జరిగిన దాడికి షియా మిలిటెంట్లు కారణమని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యాలయంలో పెంటగాన్ ఈ తాజా దాడులకు పూనుకున్నది. 
 
సిరియా-ఇరాక్ బోర్డర్‌లో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై దాడులు చేసినట్లు పెంటటాన్ అధికారులు తెలిపారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల ప్రకారం ఈస్ట్రన్ సిరియాలోని స్థావరాలపై దాడి చేసినట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments