Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా జర్నలిస్టును చంపేశారు.. ఎందుకంటే...

బంగ్లాదేశ్‌లో ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. అదీ ఆమె ఇంట్లోనే పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య వెనుక ఆమె భర్త ఉన్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (08:31 IST)
బంగ్లాదేశ్‌లో ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. అదీ ఆమె ఇంట్లోనే పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య వెనుక ఆమె భర్త ఉన్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
 
బంగ్లాదేశ్‌కు చెందిన సుబర్నా అఖ్తర్ నోడి (32) అనే మహిళ జర్నలిస్టుగా పని చేస్తోంది. ఈమె ఆనంద అనే ప్రైవేట్ న్యూస్ చానెల్‌తోపాటు జాగ్రోతో బంగ్లా అనే దినపత్రిక కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా భర్తతో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తన 9 యేళ్ళ కుమార్తెతో కలిసి పాబ్నా జిల్లా రాధానగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో 12 మంది దుండగులు ఆమె ఇంటికొచ్చి బెల్ కొట్టారు. డోర్ తీసిన ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి లోపలికి వెళ్లేందుకు వెనుదిరిగింది. అంతే.. ఒక్కసారిగా పదునైన ఆయుధాలతో దుండగులు ఆమెపై దాడి చేశారు. 
 
ఆ తర్వాత ద్విచక్రవాహనాలపై పారిపోయారు. రక్తమడుగులో ఉన్న సుబర్నాను స్థానికులు దవాఖానకు తరలించగా, అప్పటికే ఆమె చనిపోయింది. కాగా, సుబర్నా హత్య వెనుక భర్త రజిబ్ హుస్సేన్, మామ అబ్దుల్ హుస్సేన్ హస్తం ఉందని మృతురాలి బంధువులు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments