Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త... ఆయన ప్రియురాలే మా చావులకు కారణం...

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (13:06 IST)
తమ చావులకు కట్టుకున్న భర్తతో పాటు ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళే కారణమని ఓ మహిళ ఆరోపిస్తూ, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తన భర్త చేష్టలతో విసిగిపోయిన తాము.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చివరగా వాట్సాప్ సందేశం పంపించి బలవన్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని హనుమంతనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్ధయ్య, రాజేశ్వరి (40) అనే వారికి గత 18 యేళ్ల క్రితం వివాహం కాగా, వీరికి మానస(17), భూమిక(15) అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే సెక్యూరిటీ ఉద్యోగం చేసే సిద్ధయ్యకు గత మూడేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె మాయలోపడి కట్టుకున్న భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశారు. దీంతో రాజేశ్వరికి, సిద్ధయ్యకు మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 
 
సిద్ధయ్య ప్రవర్తన నచ్చని రాజేశ్వరి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఆదివారం రాత్రి భర్త ఇంట్లో నుంచి బయటకెళ్లిన తర్వాత.. రాజేశ్వరి, ఆమె ఇద్దరు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కంటే ముందు.. తమ జీవితాలను తన భర్త నాశనం చేశాడని, తమ చావుకు సిద్ధయ్య, ఆయన ప్రియురాలే కారణమని వాట్సాప్‌ స్టాటస్‌ పెట్టింది. 
 
ఇక ఆదివారం రాత్రి నుంచి మరుసటి రోజు కూడా ఇల్లు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సిద్ధయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments