29 రోజుల శిశువును బలిగొన్న కరోనా.. అత్యంత పిన్న కరోనా బాధితుడిగా..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (17:46 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో.. దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనాతో మృతి చెందారు. తాజాగా కరోనా వైరస్‌తో 29 రోజులు పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని బటంగస్ ప్రావిన్స్‌కు చెందిన 29 రోజుల శిశువు కరోన బారినపడి పుట్టి నెల కూడా గడవకుండానే ఊపిరి విడిచింది.
 
 ప్రపంచంలో కోవిడ బారినపడి మృతిచెందిన అత్యంత పిన్న కరోనా బాధితుడు ఈ శిశువే కావడం గమనార్హం. కరోనా సోకడంతో శిశువుకు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో డాక్టర్లు ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో చికిత్స్ అందించారు. 
 
అయినా కూడా చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయారు. మొన్నీమధ్య ఫిలిప్పీన్స్‌లో ఇంతకుముందు ఏడేళ్ల చిన్నారి కూడా కరోనా వైరస్ సోకి మరణించిన సంగతి తెలిసిందే. రోగనిరోధక వ్యవస్థ సంక్రమణకు అతిగా స్పందించి శరీర అవయవాలను దెబ్బతీసినప్పుడు ఆ బిడ్డకు ప్రాణహాని తప్పలేదని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments