Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ఎపిలో ఆ ఇద్దరు మంత్రులు, సామాజిక దూరం ఎక్కడ?

Advertiesment
AP ministers
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:23 IST)
పదిమందికి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే సామాజిక దూరాన్ని గాలికొదిలేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని మే 3వతేదీ వరకు గడువు పొడిగిస్తే ఎపిలో మంత్రులు మాత్రం కరోనా మాకు సోకదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
కరోనా వైరస్ నియంత్రణ కోసం తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అయితే మంత్రులు పక్కపక్కనే కూర్చుని కనిపించారు. కాన్ఫరెన్స్‌లో మంత్రులు మాస్క్‌లు కూడా వేసుకోలేదు. 
 
ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోందని.. జనం ఎక్కడ గుంపులు గుంపులుగా కనిపించకూడదని అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అలాంటిది ప్రజలకు చెప్పాల్సిన మంత్రులే ఇలా పక్కపక్కన కూర్చుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపేస్తాం - ట్రంప్