Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (09:40 IST)
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలా శివారు శివారుల్లో ఓ బస్సు వంతెన పైనుంచి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 55 మంది మృత్యువాతపడ్డారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రోగ్రెసో అనే ప్రాంతం నుంచి గ్వాటెమాలా నగరానికి వెళుతుండగా ఓ వంతెనపై పలు వాహనాలు ఢీకొనడేంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపకదళ శాఖ అధికారి ఎడ్విన్ విల్లాగ్రాన్ తెలిపారు. బస్సు 115 అడుగుల లోతులో మురుగునీటి ప్రవాహంలో పడిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. 

భర్తతో విడిపోయింది.. అక్రమ సంబంధం పెట్టుకుంది.. సుపారీ ఇచ్చి హత్య చేయించారు...
 
మనస్పర్థల కారణంగా కట్టుకున్న భర్తతో విడిపోయిన ఓ మహిళ.. ఆ తర్వాత పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసిన భర్త కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేయించారు. ఇందుకోసం భారీ మొత్తాన్ని సుపారీ రూపంలో ఖర్చు చేశారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని బెల్లంపల్లి పట్టణానికి చెందిన మేడ మమత అనే మహిళ తన భర్త భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయి, మంచిర్యాలలో ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణిలో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయాన్ని భర్త భాస్కర్సోదరి నర్మదకు తెలిసింది. దీంతో ఆమె తన ప్రియుడు రఘుతో కలిసి మమత హత్యకు ప్లాన్ వేసింది. సుపారీ హంతకుడు వేల్పుల కళ్యాణ్‌కు రూ.5 లక్షల వరకు డబ్బులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మమతను హత్య చేసిన తర్వాత కళ్యాణ్‌కు నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగంలు హంతకుడుకి ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించారు.
 
అయితే, హత్య తర్వాత మమత మృతదేహాన్ని తీసుకెళ్లి, జిల్లాలోని గంగాధర మండలం, కొండన్నపల్లి శివారు ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత కళ్యాణ్ చెన్నైకు పారిపోయారు. దీనిపై మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కళ్యాణ్ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసిన నర్మద, ఆమె ప్రియుడు రఘు, నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగులను ఇంటివద్దే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments