Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (09:19 IST)
ఈ నెల 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరుగనుంది. ఈ సందర్భంగా మేడారం వనదేవతులు సమ్మక్కసారలమ్మకు ప్రత్యేక పూజలు చేసేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతరకు 10 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ఆమె సంబంధిత అధికారులతో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. 
 
ముఖ్యంగా, జాతర సమయంలో గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాటలు, చోరీలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ప్రధానంగా జంపన్నవాగు, గద్దెల ప్రాంత, మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చినా పార్కింగ్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments