Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (09:19 IST)
ఈ నెల 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరుగనుంది. ఈ సందర్భంగా మేడారం వనదేవతులు సమ్మక్కసారలమ్మకు ప్రత్యేక పూజలు చేసేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతరకు 10 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ఆమె సంబంధిత అధికారులతో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. 
 
ముఖ్యంగా, జాతర సమయంలో గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాటలు, చోరీలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ప్రధానంగా జంపన్నవాగు, గద్దెల ప్రాంత, మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం శుభ్రం చేయించాలని ఆదేశించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చినా పార్కింగ్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments