Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు.. కారు బాంబు పేలి 30మంది మృతి

Webdunia
శనివారం, 1 మే 2021 (16:07 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. ఆప్ఘన్, తూర్పు లోగర్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో విద్యార్థులు అధికంగా ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
తాలిబన్లు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వారి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రంజాన్ ను పురస్కరించుకుని ఉపవాస దీక్షల అనంతరం పలువురు లోగర్ ప్రావిన్స్‌లోని ఓ ఇల్లును గెస్ట్‌హౌస్‌గా వాడుకుంటున్నారు. 
 
శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం ఉపవాసం విడిచిన వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గెస్ట్ హౌస్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుపై కారు బాంబు పేలింది. 
 
ఈ ధాటికి గెస్ట్‌హైస్ కుప్పకూలిపోయి 30 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. సుమారు 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , అన్నీ కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments