Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో పెను విషాదం... శరణార్థుల పడవ మునిగి 27 మంది మృతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (16:46 IST)
ఇటలీ దేశంలో పెను విషాదం సంభవించింది. శరణార్థులతో వస్తున్న పడవ ఒకటి సముద్రంలో మునిగిపోయింది. దీంతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ శరణార్థులంతా ఇరాన్, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఓ పసికందు కూడా ఉంది. చనిపోయిన వారి మృతదేహాలు ఓ గ్రామంలోని తీరానికి కొట్టుకుని వచ్చాయి. దీంతో అక్కడ పెను విషాదం నెలకొంది. 
 
తమ సొంత దేశంలో జీవించలేక, స్థానికంగా నెలకొన్న భయానక పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు శరణార్ధులుగా అనేక మంది అక్రమ మార్గంలో వెళుతూ ఇలా సముద్ర ప్రమాదాలకు గురవున్నారు. 
 
తాజాగా, ఇటలీ తీరంలో శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 27 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది. ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. 
 
వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments