Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో పెను విషాదం... శరణార్థుల పడవ మునిగి 27 మంది మృతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (16:46 IST)
ఇటలీ దేశంలో పెను విషాదం సంభవించింది. శరణార్థులతో వస్తున్న పడవ ఒకటి సముద్రంలో మునిగిపోయింది. దీంతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ శరణార్థులంతా ఇరాన్, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఓ పసికందు కూడా ఉంది. చనిపోయిన వారి మృతదేహాలు ఓ గ్రామంలోని తీరానికి కొట్టుకుని వచ్చాయి. దీంతో అక్కడ పెను విషాదం నెలకొంది. 
 
తమ సొంత దేశంలో జీవించలేక, స్థానికంగా నెలకొన్న భయానక పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు శరణార్ధులుగా అనేక మంది అక్రమ మార్గంలో వెళుతూ ఇలా సముద్ర ప్రమాదాలకు గురవున్నారు. 
 
తాజాగా, ఇటలీ తీరంలో శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 27 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది. ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. 
 
వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments