Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 27మంది మృతి.. 35 మందికి గాయాలు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:08 IST)
ఇండోనేషియాలోని జావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జావా ప్రావిన్స్‌ సుబంగ్‌ పట్టణం నుండి బయలు దేరిన పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో 27మంది ప్రయాణీకులు మృతి చెందారు. డ్రైవర్‌తో సహా మరో 35 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. 
 
ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తాసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బస్సు లోయలో పడిపోయింది. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. 
 
వాహనం డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో సుమారు 20 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోయిందని పేర్కొన్నారు. సువేదాంగ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. అయితే, ప్రాణాలతో బయటపడ్డ బాధితులంతా వాహనం బ్రేకులు సరిగా పనిచేయలేదని అధికారులకు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments