Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 27మంది మృతి.. 35 మందికి గాయాలు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:08 IST)
ఇండోనేషియాలోని జావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జావా ప్రావిన్స్‌ సుబంగ్‌ పట్టణం నుండి బయలు దేరిన పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో 27మంది ప్రయాణీకులు మృతి చెందారు. డ్రైవర్‌తో సహా మరో 35 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. 
 
ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తాసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బస్సు లోయలో పడిపోయింది. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. 
 
వాహనం డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో సుమారు 20 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోయిందని పేర్కొన్నారు. సువేదాంగ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. అయితే, ప్రాణాలతో బయటపడ్డ బాధితులంతా వాహనం బ్రేకులు సరిగా పనిచేయలేదని అధికారులకు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments