Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మెరుపు దాడుల్లో జైషే చీఫ్ మసూజ్ అజర్ మృతి?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (09:56 IST)
జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మరణంపై భిన్న కథనాలు వినొస్తున్నాయి. గత నెల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జేషే ఉగ్రతండాలపై భారత వైమానికదళం జరిపిన మెరుపుదాడుల్లో తీవ్రంగా గాయపడిన అజర్.. పాకిస్థాన్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు సమాచారం. ఇది ఒక కథనం. 
 
మరోవైకథనం ఏంటంటే... గత కొన్ని రోజులుగా కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చిన అజర్.. తాజాగా మరణించినట్టు సమాచారం. దీనిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మసూద్ మరణించాడన్న వదంతుల నేపథ్యంలో జైషే మహమ్మ ద్ ఆదివారం ఓ ప్రకటన చేస్తూ .. మసూద్ బతికే ఉన్నాడని, అతడి ఆరోగ్యం బాగానే ఉన్నదన్నది.
 
మరోవైపు మసూద్ మరణ వార్తలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు భారత నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అధికార వర్గాలు చెప్పాయి. మసూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. 
 
మసూద్‌కు వ్యతిరేకంగా భారత్ బలమైన ఆధారాలు సమర్పిస్తే అతడిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఐఏఎఫ్ దాడుల్లో జైషేకు ఏ మేరకు నష్టం వాటిల్లిందో ఆధారాలు చూపాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం త్వరలోనే ఆధారాలు బయటపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆధారాలు బయటపెట్టాలా? వద్దా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఐఏఎఫ్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments