Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ కొరత: జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (21:05 IST)
Army
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్‌పై ఆధారపడుతున్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిన కారణంగా కరోనా వ్యాధిగ్రస్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలని రక్షణ శాఖ నిర్ణయించింది. 
 
దీని కోసం ఎమర్జెన్సీ నిధుల వినియోగానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాలుగు రోజుల కిందట అనుమతి ఇచ్చారు. దీంతో ఎక్కడికైనా తరలించే మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను భారత్‌కు తీసుకువచ్చేందుకు సైనిక రవాణా విమానాలను సిద్ధం చేస్తున్నారు.
 
సంబంధిత ప్రక్రియలు పూర్తయితే వారం రోజుల్లో ఇవి దేశానికి చేరుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఏఎఫ్ఎంసీ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఉంచుతారని చెప్పారు. 
 
ప్రతి ప్లాంట్ నిమిషానికి 40 లీటర్లు, గంటకు 2,400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అవసరం మేరకు వీటిని ఎక్కడికైనా తరలించవచ్చని పేర్కొన్నారు. మరిన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నదని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments