Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విలయతాండవం.. అమెరికా అగ్రస్థానం.. లాక్‌డౌన్‌ కొనసాగింపు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:06 IST)
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో మొన్నటి వరకు ఇటలీ తొలి స్థానంలో ఉండగా, ఇప్పుడు అమెరికా ఈ స్థానానికి ఎగబాకింది.

కరోనా మృతుల సంఖ్య సహా పాజిటివ్‌ కేసుల్లోనూ అమెరికా ముందు వరుసలో నిలిచింది. కొవిడ్‌-19 వైరస్‌ సోకిన వారిలో గంటకు 83 మంది చొప్పున మరణిస్తున్నట్టు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది.
 
ఆదివారం రాత్రికి దేశవ్యాప్తంగా 21,474 మంది కరోనా కాటుతో పిట్టల్లా రాలినట్లు పేర్కొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరిలో ఒకరి మరణంతో మొదలైన మృత్యుఘోష.. శర వేగంగా ప్రజల ప్రాణాలను కబళించేస్తోందని తెలిపింది. ప్రస్తుతం 5.45 లక్షల మంది పాజిటివ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
 
కరోనాపై ఆదిలో ఉదాసీనంగా వ్యవహరించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు కఠిన చర్యలకు దిగారు. దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడంతోపాటు 50 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను 30 వరకు పొడిగించారు. కరోనాను పెను విపత్తుగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments