Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యార్థికి అమెరికాలో జైలు శిక్ష, 14 లక్షల జరిమానా

Webdunia
గురువారం, 15 ఆగస్టు 2019 (12:23 IST)
అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థికి ఏడాది జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది అక్కడి స్థానిక కోర్టు. దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేయడమే అతడు చేసిన నేరం. చిత్తూరు జిల్లాకు చెందిన ఆకుతోట విశ్వనాథ్ అనే స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లాడు. అక్కడ న్యూయార్క్‌లోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే కావాలనే 66 కంప్యూటర్లలో యూఎస్బీ కిల్లర్ డివైజ్‌ని ఇన్సర్ట్ చేశాడు.
 
ఈ డివైజ్‌ని కంప్యూటర్‌లోని యూఎస్బీ పోర్టులో చేర్చినప్పుడు కంప్యూటర్‌లోని ఆన్‌బోర్డ్ కెపాసిటర్లు వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. దాంతో పాటు పదే పదే డిశ్చార్జ్ అయ్యేలా ఒక అలర్టును పంపుతుంది. దీంతో యూఎస్బీ పోర్టు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఓవర్ లోడ్ అయ్యి అవి పాడవుతాయి. విశ్వనాథ్ ఫిబ్రవరి 14వ తేదీన ఇలా చేశాడు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 22వ తేదీన విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా… ఏడాది పాటు జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments