Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరాసలో భారత్‌కు మా పూర్తి సహకారం : అమెరికా

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:05 IST)
జైష్ ఏ మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత తీర్మానాన్ని చైనా నాలుగోసారి కూడా వ్యతిరేకించడంతో అమెరికా మండిపడుతోంది. మసూద్ అజార్‌ను తప్పనిసరిగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి తీరాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది.


అలా ప్రకటించని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శాంతికి భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. బుధవారం నాడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ముఖ్యమైన సమావేశం జరగనున్న నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.
 
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో పేర్కొన్నారు. జైషే మహ్మద్ అనేక ఉగ్ర దాడులకు పాల్పడిందని, ఆ దాడుల వల్ల అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

ఉగ్రవాదంపై భారత్‌తో కలిసి పోరాడే విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసారు. ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్‌తు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా ఇప్పటికి 3 సార్లు ప్రతిపాందించగా చైనా ప్రతిసారీ ఈ విషయంలో అడ్డు తగులుతూ వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పల్లాడినో శాంతి స్థాపనకు అమెరికా, చైనా కలిసి పని చేస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments