Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్జీరియాలో కుప్పకూలిన మిలటరీ విమానం.. 257 మంది సజీవదహనం

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమా

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:50 IST)
అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమానం, టేకాఫ్‌ అయిన కాసేపటికే  పొలాల్లో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ప్రయాణీకుల్లో 257 మంది సజీవదహనమయ్యారు. ఇద్దరు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 
విమానంలోని మృతులంతా ఆర్మీకి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులేనని సహాయక సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు.. అధికారులు తెలిపారు. కానీ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
 
2014లో ఉక్రెయిన్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేషియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన భారీ విమాన ప్రమాదం ఇదేనని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments