Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్జీరియాలో కుప్పకూలిన మిలటరీ విమానం.. 257 మంది సజీవదహనం

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమా

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:50 IST)
అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతి చెందారు. అల్జీర్స్‌కి సమీపంలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి బెచార్ నగరానికి సమీపంలో 259 మందితో కూడిన ఇల్యుషిన్‌ 2–76 రవాణా విమానం, టేకాఫ్‌ అయిన కాసేపటికే  పొలాల్లో కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో.. ప్రయాణీకుల్లో 257 మంది సజీవదహనమయ్యారు. ఇద్దరు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు.
 
విమానంలోని మృతులంతా ఆర్మీకి చెందిన వారు, వారి కుటుంబ సభ్యులేనని సహాయక సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు.. అధికారులు తెలిపారు. కానీ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
 
2014లో ఉక్రెయిన్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న మలేషియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన భారీ విమాన ప్రమాదం ఇదేనని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments