Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ప్రకృతి వైపరీత్యాలు : 78 మంది చనిపోయారు

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (08:44 IST)
చైనాలో శక్తిమంతమైన టోర్నడో, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో దాదాపు 78 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికిపైగా గాయపడ్డారు. దీంతో తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు, కొండ చరియలు విరిగిపడటం, ఇతర విపత్తులకు దాది తీసిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. 
 
గురువారం మధ్యాహ్నం కురిసిన కుంభవృష్టి, వడగండ్ల వాన, టోర్నడోలు యాన్‌చెంగ్ సిటీలో విధ్వంసం సృష్టించాయి. గంటకు 125 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భవనాలు కూలి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వృక్షాలు నెలకొరిగాయి. 
 
లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. కూలిన ఇండ్ల నుంచి బాధితులను కాపాడటానికి సహాయక సిబ్బంది ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. దెబ్బతిన్న గ్రామాల్లో యాన్‌చెంగ్ సిటీకి చెందిన ఉన్నతాధికారులు సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments