Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ పైశాచికత్వం... భారత జవాన్ల తలలు తెగనరికి.. శరీరం ముక్కలుముక్కలుగా చేసి...

పాక్‌ శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు పైశాచికానందం పొందింది. సరిహద్దుల్లో కవ్వించి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత భూభాగంలోని ప్రవేశించి, ఇద్దరు భారత జవాన్లను కాల్చి చంపింది. అంతటితో ఆగని పాక

Webdunia
మంగళవారం, 2 మే 2017 (09:09 IST)
పాక్‌ శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు పైశాచికానందం పొందింది. సరిహద్దుల్లో కవ్వించి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత భూభాగంలోని ప్రవేశించి, ఇద్దరు భారత జవాన్లను కాల్చి చంపింది. అంతటితో ఆగని పాక్ జవాన్ల బృంద పైశాచికానందం.. అత్యంత కిరాతకంగా వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసింది. ఈ ఘటనపై భారత సైన్యం భగ్గుమంది. సైన్యం నీచమైన చర్యకు తగిన సమాధానం ఇస్తామని ప్రకటించింది. ఈ దారుణం సోమవారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జమ్మూకాశ్మీర్‌ పూంఛ్‌లో నియంత్రణ రేఖ వద్ద సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపై కాల్పులకు దిగింది. అప్రమత్తమైన భారత జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఓవైపు కాల్పులు జరుగుతుండగానే మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ) సభ్యులు 250 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. బీఏటీలో పాక్‌ సైనికులతోపాటు ఉగ్రవాదులు సభ్యులుగా ఉంటారు.
 
బీఏటీ సభ్యులు భారత భూభాగంలోకి చొరబడిన సమయంలో కృష్ణా ఘాటి సెక్టార్‌లోని బోర్డర్‌ పోస్టుల్లో 22 సిక్కు బెటాలియన్‌కు చెందిన తొమ్మిది మంది బృందం విధులు నిర్వహిస్తోంది. వీరిపై బీఏటీకి చెందిన ముష్కరులు మోర్టార్లతో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో నాయిబ్‌ సుబేదార్‌ పరంజీత సింగ్‌, బీఎస్ఎఫ్ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్‌ వీరమణం పొందగా, వారి శరీరాలను ముక్కలు ముక్కలు చేసిన బీఏటీ సభ్యులు అనంతరం వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘటనలో మరో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ రాజిందర్‌ సింగ్‌ గాయపడ్డారు. 
 
ఈ తాజా ఘటనతో భారత, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గూఢచర్యం ఆరోపణలపై భారతీయుడైన కుల్‌భూషణ్‌ జాదవ్‌కు ఉరిశిక్ష విధించడం.. తాజాగా ఇద్దరు భారత జవాన్లను దారుణంగా హతమార్చడంతో భారత సైన్యం భగ్గుమంటోంది. గత రెండేళ్లుగా పాకిస్థాన్‌ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. నెల రోజుల వ్యవధిలో పూంచ్‌, రాజౌరి సెక్టార్లలో పాక్‌ ఏడుసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments