Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను మించిన కొత్త వైరస్... 24 గంటల్లో ముగ్గురి మృతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (13:19 IST)
ప్రపంచలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత అనేక రకాలైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ వేరియంట్ వైరస్‌లు సోకిన వారిలో పలువురు మృత్యువాతపడుతున్నారు. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా ఆఫ్రికా దేశాల్లో వైద్యులకే అంతు చిక్కని విధంగా, కరోనాను మించిన కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. గత 24 గంటల్లో ఈ వైరస్ సోకిన వారిలో ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 
 
ఈ వైరస్ బారినపడినవారికి జ్వరం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టు స్థానిక వైద్యులు వెల్లడించారు. ఇదేసమయంలో ఈ వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని తెలిపారు. నిజంగానే ఇది ఆందోళన కలిగించే విషయమని వారు తెలిపారు. కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్రికా దేశాల్లో ఒకటైన బురుండి దేశ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు బజిరో పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇదిలావంటే, కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బురిండి సమీప దేశాలకు హెచ్చరికలు చేసింది. కొత్త వైరస్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. కాగా, ఇటీవల బురిండి పక్కదేశమైన టాంజానియాలో మార్‌బర్గ్ అనే కొత్త వైరస్ వెలుగు చూసిన విషయం తెల్సిందే. దీంతో ఇదే వైరస్ బురిండిలో కూడా వ్యాపించిందా అనే సందేహం కలుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments