Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ అంశంలోకి మమ్మల్ని లాగొద్దు : పాక్‌కు తేల్చి చెప్పిన ఆప్ఘాన్

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (13:27 IST)
కాశ్మీర్ అంశంలోకి తమను లాగొద్దని పాకిస్థాన్‌కు అప్ఘనిస్థాన్ తేల్చిచెప్పింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దుతో అప్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పాకిస్థాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అప్ఘనిస్థాన్ ఒకింత ఘాటుగానే స్పందించింది. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అప్ఘాన్‌కు జోడించి మాట్లాడటం ఆపేయాలని ఆ దేశానికి హితవు పలికింది. 
 
ఈ మేరకు అమెరికాకు అప్ఘానిస్థాన్ అంబాసిడర్‌ రోయా రహ్మానీ ఓ లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమ దేశంపై పాక్‌ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. 'అమెరికాకు పాకిస్థాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ అఫ్గానిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దీనిపై గట్టిగా ప్రశ్నిస్తున్నాం. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న వారి వ్యాఖ్యలు అర్థరహితం. పాక్‌కు అప్ఘాన్‌ నుంచి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 
 
ముఖ్యంగా, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వేలాంది మంది మిలటరీ బృందాలను ఎందుకు పెట్టిందో మాకు సరైన కారణం కనిపించడంలేదు. పాకిస్థాన్‌లో ఉండే ఉగ్రవాదుల నుంచి అప్ఘాన్‌కు తరచూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. మా దేశం వైపు ఉసిగొల్పేలా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒక వేళ ఇందులో పాక్‌ పాత్ర లేకపోతే బహిరంగంగా దీనిపై మాట్లాడాలి. ఉగ్రవాదంపై కఠిన చట్టాలను అమలు పరచాలి' అని లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments