Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు టీవీ యాంకర్ - నేడు సమోసా విక్రేత

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (07:59 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆదేశ ప్రజల పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. తాలిబన్ రాజ్యం రావడంతోనే అనేక మీడియా సంస్థలు మూతపడ్డాయి. దీంతో వందలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. అలాంటి వారిలో మూసా మొహ్మద్ ఒకరు. ఒకడు జర్నలిస్టుగా, టీవీ యాంకర్‌గా పని చేశారు. 
 
ముఖ్యంగా, మంచి టీవీ యాంకరుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుదక్కించుకున్నారు. కానీ నేడు బతుకుదెరువు కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోవడం రోడ్డు పక్కన సమోసా విక్రయిస్తున్నాడు. తద్వారా వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 
 
కుటుంబ పోషణ కోసం ఈ పాత్రికేయుడు మూసా మొహమ్మది వీధుల్లో సమోసాలు అమ్ముకుంటూ దర్శనమిచ్చాడు. అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అతడి పరిస్థితిపై ఆఫ్ఘనిస్థాన్ జాతీయ రేడియో, టీవీ విభాగం డైరెక్టర్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో నిపుణుల అవసరం ఎందో ఉందని, మూసా మొహమ్మదికి తమ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. 
 
కాగా, మొహమ్మది సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న విషయాన్ని మాజీ అధికారి కబీర్ హక్మల్ తెరపైకి తీసుకువచ్చారు. ఆయనే మొహమ్మది ఇటీవలి ఫొటోను తొలిసారి పంచుకున్నారు. కబీర్ హక్మల్ గతంలో హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments