Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధం వల్ల విసిగిపోయారు.. త్వరలోనే తాలిబన్ అగ్ర నాయకుల్ని కలుస్తా!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (12:09 IST)
యుద్ధం వల్ల ప్రతి ఒక్కరూ విసిగిపోయారని, సుదీర్ఘకాలం జరిగిన ఘర్షణలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా-తాలిబన్ల మధ్య శనివారం జరిగిన శాంతి ఒప్పందం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. చాలాకాలం నుంచి పోరాడుతున్న తమ సైనికులను ఈ సందర్భంగా అభినందించారు.
 
''తాలిబన్లతో శాంతి ఒప్పందం ఎంతో చారిత్రకమైంది. ఆప్ఘన్ ప్రభుత్వంతో జరిగే తదుపరి చర్చలు ఎంతో క్లిష్టమైనవని ప్రతిఒక్కరూ వాదిస్తున్నారు. కానీ, అది కూడా విజయవంతంగానే ముగుస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే యుద్ధం వల్ల అందరూ విసిగిపోయారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు'' అని శ్వేతసౌధంలో మీడియాతో అన్నారు. త్వరలోనే తాలిబన్ల అగ్ర నాయకులను వ్యక్తిగతంగా కలుస్తానని ట్రంప్‌ చెప్పారు. ఒప్పందంలోని నిబంధనల్ని అమలుపరుస్తూ వారు శాంతిస్థాపనకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఒప్పందం అమలైతే సేనల్ని వెనక్కి రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 18 ఏళ్ల యుద్ధానికి తెరదించడానికి ఇరుపక్షాలకు ఇది గొప్ప అవకాశం అన్నారు. తాలిబన్‌-అమెరికా సేనల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్‌ సహా అంతర్జాతీయ సమాజం స్వాగతించాయి. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments