Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాట్ కొట్టింది... రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (13:06 IST)
దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాట్ కొట్టింది. అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తీసిన అబుధాబి బిగ్‌టికెట్ డ్రాలో బెంగాల్‌కు చెందిన దీపాంకర్ డే ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు.
 
కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం భార్య స్వాతి డే, కూతురు తనిస్తాలతో కలిసి బెంగాల్‌లోనే ఉంటున్న దీపాంకర్... జూలై 14న ఆన్‌లైన్‌లో మరి కొంతమంది స్నేహితులతో కలిసి నెం. 041486 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 
 
ఈ టికెటే ఇప్పడు అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. దీంతో దీపాంకర్ ఆనందానికి అవధుల్లేవు. ఈ లాటరీ కింద ఏకంగా 12 మిలియన్ దిర్హామ్స్‌ (సుమారు రూ.24కోట్లు) గెలుచుకున్నాడు 
 
ఇక బిగ్‌టికెట్ రాఫెల్‌ ఆర్గనైజర్ రిచర్డ్ తనకు లాటరీ గెలిచినట్టు ఫోన్ చేసిన సమయంలో తాను వంటగదిలో బిజీగా ఉన్నానని దీపాంకర్‌ తెలిపాడు. 2018 నుంచి బిగ్‌టికెట్ రాఫెల్‌లో 11 మంది స్నేహితులం కలిసి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని, ఎప్పుడో ఒకసారి తాము లాటరీ గెలిచి తీరుతామని నమ్మేవాళ్లమని అన్నాడు. అది నిజమైందని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గెలిచిన ఈ భారీ మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామన్నాడు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments