Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు మరో వైరస్‌ తోడైంది... ఏడుగురు మృతి.. అచ్చంగా కోవిడ్ లాగానే..?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:22 IST)
కరోనాకు మరో వైరస్‌ తోడైంది. సివియర్ ఫీవర్ విత్ త్రామ్ బోసిటోపెనియా సిండ్రోమ్ (ఎస్ఎఫ్‌టీఎస్) అని ఈ వైరస్‌ని పిలుస్తారు. ఇది కూడా చైనాలోనే పుట్టింది. అప్పుడే ఈ వైరస్ బారిన 60మంది పడ్డారని, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. దీని లక్షణాలు కూడా అచ్చంగా కరోనా లక్షణాల మాదిరిగానే ఉన్నాయి. 
 
విపరీతంగా దగ్గు, జ్వరం వస్తాయి. అయితే.. ఇదేం కొత్త వైరస్ కాదు.. ఇంతకు ముందే 2010లోనే చైనాలో కనిపించిందని కూల్‌గా చెప్తోంది. ఆ తర్వాత జపాన్, కొరియాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ లో 37 కేసులు వెలుగు చూశాయి. 
 
పదేళ్ల తరువాత మళ్లీ వెలుగు చూసిన ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మనుషుల రక్తం, శ్లేషం ద్వారా వ్యాపించే అవకాశం ఉందని ఝెజియాంగ్ యూనివర్సిటీ ఆస్పత్రి వైద్యులు షెంగ్ జిఫాంగ్ పేర్కొన్నారు.
 
ఇది కూడా మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని నిర్ధారించారు. అయితే జాగ్రత్తలు తీసుకున్నంత కాలం దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments