Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్లకే రూ. 7 కోట్లు జాక్‌పాట్ గెలుచుకున్న లక్కీ గర్ల్

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:49 IST)
ఒక భారతీయ బాలికకు దుబాయ్‌లో అదృష్టం వరించింది. తొమ్మిదేళ్ల వయసున్న ఆ అమ్మాయికి మిలియన్ డాలర్ల జాక్‌పాట్ గెలుచుకుని ఒక్కరోజులో కోటీశ్వరురాలైంది. అయితే ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండే అదృష్టం వరిస్తోందట. 2013లో మూడేళ్ల వయస్సు ఉండగానే లగ్జరీ కారును గెలుచుకుని, మళ్లీ ఆరేళ్ల తర్వాత అంటే 2019లో మిలియన్ డాలర్ల లాటరీని గెలుచుకుంది.
 
వివరాల్లోకి వెళితే దుబాయిలో ప్రతి సంవత్సరం ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు, భారతీయ కరెన్సీలో 7 కోట్ల రూపాయలు. అయితే ఈ ఏడాది ఎమ్. ఎలీజా అనే భారత సంతతి బాలిక తండ్రి ఈ లాటరీని ఆమె పేరుపై 0333 నంబర్ గల లాటరీ టిక్కెట్ కొన్నాడు. అదృష్టవశాత్తూ అతను కొనుగోలు చేసిన నంబర్‌కే లాటరీ తగలడంతో తన కూతురు అదృష్టవంతురాలని మురిసిపోతున్నాడు.
 
తాను దుబాయ్‌లో 19 ఏళ్లుగా ఉంటున్నానని, అయితే 15 ఏళ్లుగా ప్రతి ఏడాది ఈ లాటరీని కొంటున్నానని అతను చెప్పాడు. అతని లక్కీ నంబర్ 9 కావడంతో 0333 నంబర్ టిక్కెట్‌ను తన తొమ్మిదేళ్ల కూతురు పేరిట కొన్నానని, దానికే ప్రైజ్‌మనీ రావడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు. కాగా ఈ లాటరీలో విజేతగా నిలిచిన 140వ భారతీయురాలిగా ఎలీజా రికార్డుకెక్కినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments