Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‍‌లో భారీ భూకంపం - ఏడుగురు మృతి

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (12:47 IST)
ఇరాన్ దేశంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఇందులో ప్రాథమిక సమాచారం మేరకు ఏడుగురు చనిపోగా మరో 400 మంది వరకు గాయపడ్డారు. ఇరాన్‌లోని అంజర్ బైజాన్ ప్రావిన్స్‌లో కోయ్ నగరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు మీద పడటంతో కొందరు మరణించారు. ఈ శిథిలాలు పైన పడకుండా తప్పించుకునే క్రమంలో పలువురు గాయపడ్డారు. అనేక మంది భవనాలపై నుంచి కిందకు దూకారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా ఉంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments