Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మహిళలకు ఇచ్చిన పింఛను హామీ ఏమైంది జాదూ రెడ్డి : నారా లోకేశ్

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (12:26 IST)
తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్ప నుంచి పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో భాగంగా, ఆదివారం శాంతిపురంలోని వివిధ వర్గాల మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసరాల ధరల భారం మోయలేకపోతున్నామని.. పొదుపు సంఘాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం హామీతో జగన్‌ అధికారంలోకి వచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల తాళిబొట్లను సీఎం తాకట్టు పెట్టారని ఆరోపించారు. 
 
మద్యం తయారీ, పంపిణీ, అమ్మకం.. ఇలా అన్ని చోట్లా జగన్‌ బినామీలే ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను ఇస్తానన్న హామీ ఏమైందని జాదూ రెడ్డి అని లోకేశ్‌ ప్రశ్నించారు. ఎన్నో ఆంక్షలతో అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. చట్టం లేకుండానే దిశ పీఎస్‌లు, వాహనాలు అంటూ మోసం చేస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎంతమందికి 21 రోజుల్లో ఉరిశిక్ష వేశారని ఆయన నిలదీశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments