Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైన్యం తిరుగుబాటుతో సూడాన్‌లో ఎమర్జెన్సీ

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:31 IST)
సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేసింది. దీంతో ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా సహా పలువురు అధికారులను రహస్య నిర్బంధం విధించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే సూడాన్‌లో ఆర్మీ జనరల్‌ అబ్దెల్‌ ఫతాహ్‌ బుర్హాన్‌ అత్యవసర అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా దేశ అధికార మండలితో పాటు ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సైన్యం తిరుగుబాటు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా, 140 మంది వరకు గాయపడ్డారు. 
 
మొత్తం ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందారని, 140 మంది వరకు గాయపడ్డారని ఆరోగ్య అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఒమర్​ అల్​ బషీర్​ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యం వైపు సుడాన్ అడుగులు వేస్తోంది​. ఈ తరుణంలో సైనిక తిరుగుబాటు జరగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారనుంది.
 
సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్​లోనే ప్రయత్నించినా అది విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్​ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ దేశం సైనిక పాలనలోకి జారుకుంది. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments