Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా మౌమెరికి సమీపంలో భారీ భూకంపం

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:47 IST)
ఇండోనేషియా దేశం మరోమారు భూకంపతాడికి గురైంది. ఈ దేశంలోని మౌమెరికి 95 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలను జారీచేశారు.
 
అయితే, యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మాలజికల్ సెంటర్ మాత్రం ఈ భూకంప తీవ్రతను 7.7గా అంచనా వేసింది. మౌమెరికి 95 కిలోమీటర్ల దూరంలో, ఫ్లోరేస్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతులో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీచేసింది. అలాగే, అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను అలెర్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments