Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్టులో ప్రవేశపెట్టనున్న శిల్పా చౌదరి.. రూ.7కోట్లు మోసం చేసిందట!

కోర్టులో ప్రవేశపెట్టనున్న శిల్పా చౌదరి.. రూ.7కోట్లు మోసం చేసిందట!
, సోమవారం, 13 డిశెంబరు 2021 (08:36 IST)
సినీ ప్రముఖులను కోట్లు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి పోలీస్ కస్టడీలో పలు విషయాలను వెల్లడించింది. మూడు రోజుల నార్సింగ్ పోలీసు కస్టడీలో వున్న శిల్పా చౌదరి.. పది కోట్ల రూపాయలకు పైగానే రాధికారెడ్డికి ఇచ్చినట్లు చెప్పినట్లు తెలిసింది. కానీ అందుకు తగిన ఆధారాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమె చేసిన మోసాలపై పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
 
శిల్ప గతంలో అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ఖాతాలో రూ. 16వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14 వేలు ఉండడం చూసి పోలీసులు షాకయ్యారు. 
 
ఇప్పటికే దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డి నుంచి శిల్ప రూ.7 కోట్లకుపైగా తీసుకుని మోసం చేసినట్టు ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడా డబ్బును వెనక్కి ఇచ్చేందుకు శిల్ప అంగీకరించింది. కాగా, మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు నేడు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారిని మహాత్ములంటారు.. భారత్ సర్కారుకు ఆప్ఘన్ ధన్యవాదాలు