Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేలుళ్లతో దద్ధరిల్లిన ఆప్ఘనిస్థాన్.. ఐదు రోజుల్లో 58 మంది మృతి

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (11:58 IST)
ఆప్ఘనిస్థాన్ పేలుళ్లతో దద్ధరిల్లుతోంది. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగిన నాలుగు పేలుళ్లలో 58 మంది పౌరులు మరణించారు. నాలుగు ప్రావిన్సుల్లో కేవలం ఐదు రోజుల్లోనే జరిగిన పేలుళ్లలో 58 మంది మరణించగా, మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారని తేలింది. 
 
జబూల్ ప్రావిన్సు పరిధిలోని కాబూల్, ఖోస్ట్‌లలో జరిగిన పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా, మరో 77 మంది విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం జరిగిన మరో పేలుడులో ఐదుగురు పౌరులు మరణించగా, మొత్తం 33 మంది గాయపడ్డారు.
 
అలాగే కాబూల్‌లో మరో పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. జబుల్‌లో జరిగిన రెండు పేలుళ్లలో 18 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరిగిన పేలుళ్లలో 30 మంది పిల్లలు మరణించారని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
 
హషీం నజారీ అనే ఓ విద్యార్థి పాఠశాలకు వెళుతూ పేలుళ్లలో మరణించాడు. ఆప్ఘనిస్థాన్ దేశంలో పేలుళ్లకు పాల్పడుతూ మానవ హక్కులను హరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు కారణమని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments