Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక ఉష్ణోగ్రత కారణంగా చెలరేగిన కార్చిచ్చు... 51 మంది మృత్యువాత

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (12:59 IST)
చిలీ దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఉష్ణోగ్రత కారణంగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో ఇప్పటివరకు 51 మంది చనిపోయారని చిలీ దేశ అధ్యక్షుడు బోరిక్ గాబ్రియెల్ వెల్లడించారు. వేలాది మంది గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. 
 
కార్చిచ్చు కారణంగా దాదాపు 1,100 ఇళ్లు మంటల్లో కాలిబూడిదైనట్లు తెలిపారు. వాల్ఫ‌రైజో ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూనే స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. సహాయక చర్యలు చేపడుతున్న వారికి సహకరించాలని బోరిక్ విజ్ఞప్తి చేశారు. 
 
కార్చిచ్చు కారణంగా మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయని.. వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు 92 కార్చిచ్చులు చెలరేగినట్లు మంత్రి కరోలినా వెల్లడించారు. మంటల తీవ్రత అధికంగా ఉన్న వాల్ఫరైజో ప్రాంతం నుంచి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments