Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (22:55 IST)
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. మృతి చెందిన విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 
 
ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
 
మృతులు పావని వరంగల్ వాసిగా గుర్తించారు. ప్రేమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వాసిగా తెలిసింది. మరొకరు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకకు చెందిన సాయి నరసింహులుగా గుర్తించారు.
 
మరోవాహనంలోని డ్రైవర్‌ ఒక్కడే ఉన్నట్టుగా తెలిసింది. 46 ఏళ్ల ఆ వ్యక్తి కారు ఓనర్‌గా తెలిసింది. అతడు కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం మెడికల్ సెంటర్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments