Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురి ప్రాణాలు తీసిన సరదా.. గడ్డకట్టిన సరస్సులో నడిచి..

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (15:24 IST)
ఓ సరదా సంఘటన ముగ్గురి ప్రాణాలు హరించింది. గడ్డకట్టిన మంచులో నడవడం వల్ల వారు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా భారతీయులే కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన అరిజానా రాష్ట్రంలోని క్యానన్ సరస్సు వద్ద జరిగింది. 
 
అరిజోనా రాష్ట్రంలో గడ్డకట్టిన సరస్సుపై నడుచుకుంటూ మంచులూ పడి ఓ మహిళ సహా ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం అరిజోనాలోని కోకోనినో కౌంటీలోని పుడ్స్ కాన్యన్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
మంచులో కూరుకునిపోయిన ఈ ముగ్గురిని సహాయక సిబ్బంది వెలికి తీసినప్పటికీ వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతులను నారాయణ ముద్దన, గోకుల్ మెడిసేటి, హరిత ముద్దనగా గుర్తించారు. వీరంతా అరిజోనా రాష్ట్రంలోని చాండ్లర్‌లో నివసిస్తున్నారు. 
 
ప్రస్తుతం నార్త్ అమెరికాలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన మంచు తుఫాను కురుస్తున్న విషయంతెల్సిందే. దీంతో ఆ ప్రాంతాల వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ మంచు తుఫాను కారణంగా ఇప్పటికే 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది విమాన సర్వీసులు రద్దు చేశారు. గృహాలు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments