Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో డ్రగ్స్‌ డీ-అడిక్షన్ సెంటర్‌పై కాల్పులు.. 24మంది మృతి

Webdunia
గురువారం, 2 జులై 2020 (12:43 IST)
drug rehab center
మెక్సికోలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం అక్కడ 2,26,089 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా 27,769 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో మెక్సికోలో కొందరు దుండగులు మారణహోమం సృష్టించారు. ఈ ఘటన గువానాహువాటో రాష్ట్రం ఇరాపూవాటోలోని మాదకద్రవ్యాల బాధితుల పునరావాస (డ్రగ్స్‌ డీఅడిక్షన్‌) కేంద్రంపై ఈ దాడిలో ఏకంగా 24 మంది మృతి చెందారు. 
 
అలాగే మరో ఏడుగురికి తీవ్ర గాయాలవ్వగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఈ కాల్పుల వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని, స్టానిక డ్రగ్ సరఫరాదారుల ముఠాకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
 
ఇరపువాటలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. జూన్‌ 6న కూడా పునరావస కేంద్రంపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడటంతో 10 మంది మరణించారు. గతంలో 2010లో చివావా నగరంలోని డ్రగ్స్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌పై ఇదేవిధంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments