Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే న్యూఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తా : డోనాల్డ్ ట్రంప్

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (14:51 IST)
అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకం విధిస్తుందని, తాను అధికారంలోకి వస్తే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వచ్చే యేడాది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందుకోసం ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆయన ఏకంగా భారత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకం విధిస్తోందని, తనను అధికారంలోకి తీసుకొస్తే న్యూఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తానని ఒక వార్తా చానెల్ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. 'భారత్ మనపై అత్యంత భారీగా పన్నులు విధిస్తోంది. ఉదాహరణకు హార్లీ-డేవిడ్సన్ బైకుల ఎగుమతిని చూస్తే ఏకంగా 100 శాతం, 150, 200 శాతాల వరకూ సుంకాన్ని విధిస్తోంది. 
 
మన దేశంలో మాత్రం ఎటువంటి పన్ను లేకుండా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. తమ దేశానికి వచ్చి పరిశ్రమను నిర్మిస్తే పన్ను ఉండదని ఆఫర్ ఇస్తోంది. కానీ అది మనకు సమ్మతం కాదు. ఈ విషయంలో నా హయాంలో చాలా గట్టిగానే ఆ దేశంతో పోరాడాను. మీరు ఏమైనా అనుకోండి, వాళ్లు మనపై సుంకం విధిస్తే, మనం కూడా విధించి తీరాల్సిందే' అని ట్రంప్ తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments