Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ ప్రిన్స్ నౌకలోని కరోనా వైరస్ బాధితులకు యాపిల్ ఐఫోన్లు.. ఎందుకు? (Video)

డైమండ్ ప్రిన్స్ నౌకలోని కరోనా వైరస్ బాధితులకు యాపిల్ ఐఫోన్లు.. ఎందుకు? (Video)
Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (14:57 IST)
జపాన్‌కు చెందిన పర్యాటక నౌక డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ బారినపడిన 3700 మంది బాధితులకు యాపిల్ ఐఫోన్లను పంపిణీ చేశారు. ఇదే విషయంపై ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నౌకలో ఉన్న కరోనా వైరస్ బాధితుల్లో భారతీయులు కూడా ఉన్నారు. ఈ బాధితుల్లో రెండు వేల మందికి యాపిల్ ఐఫోన్లను అందచేశారు. 
 
వైద్య నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు, అపాయింట్మెంట్లను బుక్ చేసుకునేందుకు, మందుల వాడకం, ఇతర అంశాలపై వైద్యులతో మాట్లాడేందుకు వీలుగా ఈ ఫోన్లను పంపిణీ చేశారు. కాగా, ఈ నౌకలో ఉన్నవారిలో దాదాపు 350 మందికి ఈ వైరస్ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలిన విషయం తెల్సిందే.
 
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు చైనా కకావికలమైపోతోంది. ఈ వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1770కు చేరింది. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
అదేసమయంలో చైనాలో కొత్తగా 2018 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కోవిద్‌-19 వైరస్‌ బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికోలుకున్న తర్వాత 10,844 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు చైనా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. 
 
మరోవైపు, పాన్‌ తీరంలో నిలిపేసిన 'డైమండ్‌ ప్రిన్సెస్' నౌకలో కోవిడ్-19 సోకిన వారి సంఖ్య ఆదివారానికి 355కి పెరిగింది. అందులోభారత్‌ సహా 50 దేశాలకు చెందిన 3700 మంది ఉన్నారు. ఆ నౌకలో నుంచి తమ వారిని తీసుకువెళ్లేందుకు అమెరికా, కెనడా సహా పలు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments