Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడుల.. 20మంది మృతి

Webdunia
మంగళవారం, 11 మే 2021 (12:45 IST)
ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్ కమాండర్‌తోపాటు 20 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్‌ రాజధాని నగరం జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇజ్రాయెల్ పోలీసులపై పాలస్తీనావాసులు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు.
 
ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయెల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో గజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు. దాంతో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడిగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 20 మంది వరకు మరణించారు.
 
మృతుల్లో 9 మంది చిన్నారులతోపాటు ఓ సీనియర్ హమాస్ కమాండర్ కూడా ఉన్నారు. జెరూసలెంలో జరిగిన ఘర్షణల్లో 305 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. 228 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాలస్తీనియన్ల రాళ్ల దాడుల్లో 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments