Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో అర్థరాత్రి ఘోరం ప్రమాదం - 17 మంది మృతి - 22 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (12:09 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జియాంగ్సి ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై క్లారిటీ రావాల్సివుంది. 
 
నానా చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు... పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించడం లేదనిస, అందువల్ల వాహనదారులు మరింత జాగ్రత్తతో వాహనాలు నడపాలని సూచించారు. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే లైన్ మారడం లేదా ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం వంటివి చేయరాదని సూచించారు. 
 
దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకోవడం చైనాలా సర్వసాధారణంగా మారింది. ఇటీవల హెనాన్న ప్రావిన్స్‌లోని ఓ వంతెనపై సుమారు 200 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ సమయంలో కూడా పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments