చైనాలో అర్థరాత్రి ఘోరం ప్రమాదం - 17 మంది మృతి - 22 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (12:09 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జియాంగ్సి ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై క్లారిటీ రావాల్సివుంది. 
 
నానా చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు... పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించడం లేదనిస, అందువల్ల వాహనదారులు మరింత జాగ్రత్తతో వాహనాలు నడపాలని సూచించారు. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే లైన్ మారడం లేదా ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం వంటివి చేయరాదని సూచించారు. 
 
దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకోవడం చైనాలా సర్వసాధారణంగా మారింది. ఇటీవల హెనాన్న ప్రావిన్స్‌లోని ఓ వంతెనపై సుమారు 200 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ సమయంలో కూడా పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments