Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో అర్థరాత్రి ఘోరం ప్రమాదం - 17 మంది మృతి - 22 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (12:09 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జియాంగ్సి ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై క్లారిటీ రావాల్సివుంది. 
 
నానా చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు... పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించడం లేదనిస, అందువల్ల వాహనదారులు మరింత జాగ్రత్తతో వాహనాలు నడపాలని సూచించారు. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే లైన్ మారడం లేదా ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం వంటివి చేయరాదని సూచించారు. 
 
దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకోవడం చైనాలా సర్వసాధారణంగా మారింది. ఇటీవల హెనాన్న ప్రావిన్స్‌లోని ఓ వంతెనపై సుమారు 200 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ సమయంలో కూడా పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments