IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 26 ఏప్రియల్ 2025 (08:49 IST)
Pakistan
పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తప్పలేదు. భారత్‌తో యుద్ధానికి సై అంటే సై అంటూ రెచ్చిపోతున్న దాయాదికి గట్టి దెబ్బ తగిలింది. బలుచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్ఎ) జరిపిన దాడిలో పదిమంది సైనికులను పాకిస్తాన్ కోల్పోయింది. పాక్‌ సైనికకులను లక్ష్యంగా చేసుకుని మార్గట్‌ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. 
 
ఆ తర్వాత ఈ దాడి తమదే అని వీడియో విడుదల చేసింది బీఎల్‌ఏ. ఈ దాడిలో పది మంది పాక్‌ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా గత మార్చి నెలలో కూడా బలుచిస్తాన్‌ లిబరేషన్‌ జరిపిన దాడుల్లో 60 మంది వరకు హతమైన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేసింది. 
 
బలుచిస్తాన్‌ ప్రజలను పాకిస్తాన్‌ ప్రభుత్వం అణచివేస్తోంది. శుక్ర‌వారం పాక్‌లోని క్వెట్టాలో బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ చేప‌ట్టిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు కోల్పోయారు. ఇదిలా ఉండగా పహల్గాం దాడి తర్వాత మాత్రం పాకిస్తాన్ తమ దేశాన్ని అలెర్ట్ చేసింది. సైన్యాన్ని సిద్ధం కావాలని ఆదేశించింది. అంతే కాదు ఎల్ఓసీ వద్ద కవ్వింపు చర్యలు కూడా చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం