సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (08:07 IST)
సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారు?.. తెలియని వారి కోసం ఈ సమాచారం. సగ్గు బియ్యం తయారికి  కర్ర పెండలం దుంపను వాడతారు. దీన్ని భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి పంపించాలి, ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రంచేసి దానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. 
 
తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుభ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో, పాల లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. 
 
ఈ పిండిని వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులు తున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి పూసల్లాగా జలజలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. 
 
ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గు బియ్యం తయారీ విధానం. తమిళనాడు కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లో తయారి మిల్లులు ఉన్నాయి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం, మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయని, బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే, బలహీనత తగ్గి తక్షణ శక్తి అందుతుందని వైద్యులు చెబుతారు. 
 
పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం, రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి, షుగర్ పేషంట్లు ఈ ఆహారాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. 
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అధికరక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

AIADMK: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలి.. అన్నాడీఎంకే

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఒక బినామీ ముఖ్యమంత్రి.. కేటీఆర్ ధ్వజం

తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ : బీజేపీ చీఫ్ నితిన్ నబిన్

తిరుమల లడ్డు కల్తీ, సైజు తగ్గిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: రమణదీక్షితులు

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు.. భారీ కార్యాచరణకు రంగం సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

తర్వాతి కథనం
Show comments