Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగ చెట్టు మందుతో శిరోవాతం మటుమాయం

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (10:46 IST)
చాలా మంది పేను కొరుడు సమస్యతో బాధపడుతుంటారు. ఈ పేను కొరుడు సమస్య ఉన్నట్టయితే తలలో ఎక్కువగా దురద పుట్టడంతో పాటు.. వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యకు చక్కటి మందు ఉందని గృహ వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ మంగ చెట్టు మందుతో కలిగే లాభాలేంటో పరిశీలిద్ధాం.
 
* తల మీద పేను కొరికిన ప్రదేశంలో మంగ పూలతో రుద్దితే, ఆ చోట మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి.
* మంగ చెట్టు కాండపు బెరడును ఎండించి చూర్ణం చేసి, ఆ చూర్ణాన్ని కొంచెం నువ్వుల నూనెలో కలిపి, నొప్పిగా ఉన్న చోట మర్దన చేస్తే కండరాల నొప్పులు తగ్గుతాయి.
* వేరు బెరడుకు సమానంగా శీకాయ పొడినిగానీ, కుంకుమ కాయ పొడినిగానీ కలిపి దానితో తలస్నానం చేస్తే చుండ్రు పోవడంతో పాటు వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
* మంగచెట్టు బెరడునుగానీ, వేరు బెరడునుగానీ, మెత్తగా నూరి కుంకుడుకాయలా తలకు రుద్దితే, నేత్రవ్యాధులు, తలనొప్పి తగ్గుతాయి. పేలు చనిపోతాయి. ఇది మెదడుకు, కళ్లకు చలువ చేయడంతో పాటు శిరోవాతం తగ్గిపోతుంది.
* మంగకాయ, అతి మధురం ఈ రెంటినీ సమానంగా తీసుకుని, చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే ఆస్తమా, ఎలర్జిక్‌ రైనైటిస్‌ సమస్యలు తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments