Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం, శీతాకాలంలో అల్లంను ఎందుకు వాడాలో తెలుసా?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (10:07 IST)
వర్షాకాలం, శీతాకాలంలో శరీరానికి అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ రెండు సీజన్‌లలో అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. లేకుంటే అనారోగ్య రుగ్మతలు తప్పవు. రోజూ వంటకాల్లో అల్లాన్ని చేర్చడం ద్వారా కడుపు ఉబ్బరం, కడుపునొప్పి దూరమవుతుంది. ఇందులోని జింజరాల్ అనే ఔషధ గుణం శరీర ఉష్ణోగ్రతని అదుపులో వుంచుతుంది. ఇంకా జలుబు దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 
 
గుండె జబ్బులు, కండరాల నొప్పులను అల్లం నివారిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు మోతాదుకి మించి తీసుకోకూడదు. రోజుకి ఒక గ్రాముకి మించి అల్లాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదని వైద్యులు చెప్తున్నారు. అల్లాన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 
వేడినీటిలో అల్లం ముక్కలు వేసి పది నిమిషాలు మరిగించి రెండు లేదా మూడు తేనె చుక్కలు వేసుకొని రోజుకి మూడుసార్లు తీసుకుంటే జలుబు మాయమవుతుంది. నీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయిన తర్వాత పగిలిన పాదాలను అందులో వుంచితే ఉపశమనం ఉంటుంది. అల్లం మధుమేహాన్ని, గుండె జబ్బుల్ని నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments