Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిశ గింజలతో చక్కెర వ్యాధికి చెక్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (09:57 IST)
నేటి సమాజంలో మధుమేహం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. చక్కెర వ్యాధి బారిన పడకుండా, ఒక వేళ ఇప్పటికే వచ్చినా సురక్షిత స్థాయుల్లో దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన జీవనశైలిపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ గృహ విజ్ఞానశాస్త్ర విభాగం ఆచార్యులు, ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.శిరీష అధ్యయనం చేశారు. అవిశ గింజలు, పెరుగుతో మధుమేహాన్ని నియంత్రిస్తాయా అనే కోణంలో తమ పరిశోధన సాగించారు. 
 
మహిళా, ఎస్వీ యూనివర్సిటీలలో ఉన్న 100 మంది టైప్‌2 డయాబెటిక్‌ పేషెంట్లను 25 మంది చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి, మొదటి గ్రూపులో ఉన్నవారికి మూడు నెలలపాటు వంద మిల్లీగ్రాముల పెరుగునే ఇచ్చారు. రెండో గ్రూపునకు 25 గ్రాముల అవిశగింజలను అందించారు. మూడో గ్రూపునకు 100 మిల్లీ గ్రాముల చొప్పున పెరుగు, 25 గ్రాముల అవిశగింజలను ఇచ్చారు. నాలుగో గ్రూపునకు 100 మి.గ్రా. పెరుగు, అవిశగింజలు, ఒక గ్రాము స్పొరొలాక్‌ అందించారు. 
 
ఇలా మూడు నెలల పాటు ఈ ఆహారాన్ని ఇచ్చి తర్వాత అందరికీ షుగరు పరీక్ష చేశాం. కేవలం పెరుగు తీసుకున్న మొదటి 25 మందిలో మధుమేహ స్థాయి తగ్గలేదు. 25 గ్రాముల అవిశగింజలు తీసుకున్న రెండో గ్రూపు సభ్యుల్లో షుగర్‌ లెవెల్స్‌ తగ్గాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌తోపాటు బరువు కూడా తగ్గారు. పెరుగు, అవిశగింజలు, స్పొరొలాక్‌ తీసుకున్నవారిలో కూడా ఇదే ఫలితం వచ్చింది. 
 
"అవిశ గింజలను నేరుగా కాకుండా వేయించి ఉప్పునీళ్లు చల్లుకుని తింటే రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్‌ మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. నేరుగా తినలేనివారు పొడిలా చేసుకుని అన్నంలో కలుపుకొని తినొచ్చు. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది'' అని శిరీష వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments