Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (14:17 IST)
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలి. రోజూ వీటిని తీసుకుంటే.. శరీరానికి అవసరమయ్యే న్యూట్రియన్స్, మినరల్స్ క్రమంగా అందుతాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్థాలతో పాటు ఇతర రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణకు బీరకాయ.. దీనిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
 

బీరకాయ జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. బీరకాయ చూడడానికి కీరదోసలానే ఉంటుంది. అయితే.. బీరకాయ తొక్క గరుకుగా ఉంటుంది. ఈ తొక్కను శుభ్రం చేసుకుని బాగా ఎండబెట్టుకోవాలి. ఆపై మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ఈ పొడిలో కొన్ని ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి మళ్లీ పొడి చేయాలి. ఇలా చేసిన పొడిని రోజుకు ఒక్కసారైనా అన్నంలో కలిపి తీసుకుంటే.. చలికాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టవచ్చును.
 

చాలామందికి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి తిన్నామ లేదా అన్న విషయాన్ని కూడా మరచిపోతుంటారు. అలాంటప్పుడు బీరకాయ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బీరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై నూనెలో వీటిని వేసి వేయించి ఉప్పు, కారం, కొబ్బరి తురుము, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా చేసిన వాటిని రోజూ క్రమంగా తింటే.. మతిమరుపు తగ్గుముఖం పడుతుంది.
 

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. బీరకాయ తప్పక తీసుకోవాలని చెప్తున్నారు వైద్యులు. శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన చాలామంది చూడడానికి నీరసంగా కనిపిస్తారు. అలాంటివారు క్రమంగా బీరకాయ కూరో లేదా వేపుడు తీసుకుంటే చాలు.. ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. బీరకాయ తీసుకుంటే జ్ఞాపకశక్తి  కూడా అధికమవుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments